Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పళని స్వామి సీఎం పీఠం రేటు రూ.600 కోట్లా...? వారి పంట పండింది...

అందుకే రాజకీయాల్లో సంక్షోభాలు రావాలని రాజకీయ పార్టీల నేతలు కోరుకుంటూ వుంటారు. పాలన సజావుగా సాగిపోతే మంత్రులుగా వున్నవారికి తప్పించి మిగిలిన ఎమ్మెల్యేలకు పెద్దగా ఒరిగేదేమీ వుండదనే ప్రచారం వుంది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన పళనిస్వ

పళని స్వామి సీఎం పీఠం రేటు రూ.600 కోట్లా...? వారి పంట పండింది...
, శుక్రవారం, 17 ఫిబ్రవరి 2017 (12:27 IST)
అందుకే రాజకీయాల్లో సంక్షోభాలు రావాలని రాజకీయ పార్టీల నేతలు కోరుకుంటూ వుంటారు. పాలన సజావుగా సాగిపోతే మంత్రులుగా వున్నవారికి తప్పించి మిగిలిన ఎమ్మెల్యేలకు పెద్దగా ఒరిగేదేమీ వుండదనే ప్రచారం వుంది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునేందుకు దాదాపు రూ. 600 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రమాణ స్వీకారం తర్వాత కూడా ఎమ్మెల్యేలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకుండా బస్సులు ఎక్కించి గోల్డెన్ బే రిసార్టుకు తరలించేశారు. 
 
ఇక్కడ తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలందరికీ ఒక్కొక్కరికీ రూ. 5 కోట్ల చొప్పున ఇచ్చేందుకు ఓ డీల్ కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ప్రకారం ఇప్పటికే ఒక్కో ఎమ్మెల్యేకు అడ్వాన్సుగా సగం డబ్బు ముట్టిందని సమాచారం. మిగిలిన డబ్బు బలపరీక్ష... ముగియగానే పువ్వుల్లో పెట్టి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తమ్మీద తమిళనాడు రాజకీయాల వేడి ఇంకా తగ్గలేదు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తనదైన రూటులో వెళ్తున్నారు. ఆయన నమ్మకమేమిటో తెలియదు కానీ ఇంకా ప్రభుత్వాన్ని పడదోయగలననే అనుకుంటున్నారు. ఏం జరుగుతుందో రేపటి వరకూ వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పన్నీర్‌కు మద్దతుగా జల్లికట్టు తరహా ఉద్యమం.. పళనికి కష్టాలే..అప్పుడే హెచ్చరించారుగా?