Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పద్మశ్రీ అవార్డుకు ఆరుగురి ఎంపిక

పద్మశ్రీ అవార్డుకు ఆరుగురి ఎంపిక
, సోమవారం, 26 జనవరి 2015 (08:06 IST)
భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులలో 6 మంది తెలుగువారికి స్థానం దక్కింది. పలు రంగాలకు చెందిన 6 మంది తెలుగువారు పద్మశ్రీకి ఎంపికయ్యారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. 75 మందిని పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేస్తే, వారిలో ఆరుగురు తెలుగువారు పద్మశ్రీ స్థానాన్ని దక్కించుకున్నారు. 
 
పద్మశ్రీ అవార్డుకు ఎంపికైనవారిలో సినీ నటుడు కోట శ్రీనివాసరావు, డాక్టర్ అనగాని మంజుల, బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, క్రికెట్ మహిళా క్రీడాకారిని మిథాలిరాజ్, ప్రముఖ కేన్సర్ వ్యాధి నిపుణుడు నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ రఘురాముడు ఉన్నారు. పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులకు ఒక్క తెలుగు ప్రముఖుడు కూడా ఎంపికకాలేదు.

Share this Story:

Follow Webdunia telugu