Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పద్మ అవార్డుల పంట.. రాష్ట్రపతి ప్రదానం...!

పద్మ అవార్డుల పంట.. రాష్ట్రపతి ప్రదానం...!
, సోమవారం, 30 మార్చి 2015 (15:57 IST)
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే పద్మ పురస్కారాల ప్రదానోత్సవ వేడుక సోమవారం ఉదయం ఘనంగా జరిగింది. ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. 
 
కాగా మదన్ మోహన్ మాలవ్య కు మరణానంతరం భరతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబ సభ్యులకు భారతరత్న పురస్కారాని అందజేశారు. బీజేపీ పార్టీ సీనియర్ నేత అద్వాణీ, ప్రకాష్ సింగ్ బాదల్ తో సహా మొత్తం తొమ్మిది మందికి పద్మవిభూషణ్ పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఇరవై మందికి పద్మ భూషణ్, డెబ్బై ఐదు మందికి పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు.
 
తెలుగు రాష్ట్రాలకు చెందిన డా.మంజుల, క్రీడారంగంలో మిథాలి రాజ్, పివీ సింధు, కళా రంగంలో కోట శ్రీనివాసరావు పద్మశ్రీ పరస్కారాలను రాష్ట్రపతి నుంచి అందుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu