Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవరాత్రి ఉత్సవాల్లో గోమూత్రం తలపై చల్లుకుని ముక్తిపొందండి!

నవరాత్రి ఉత్సవాల్లో గోమూత్రం తలపై చల్లుకుని ముక్తిపొందండి!
, ఆదివారం, 4 అక్టోబరు 2015 (11:08 IST)
భారతీయ జనతా పార్టీ అనుబంధ పార్టీగా ఉన్న హిందూ సంఘటన్ యువ మోర్చా నేతలు మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకెక్కారు. దసరా శవన్నవరాత్రుల్లో ముస్లింలను అనుమతించవద్దని హిందూ సంఘటన్ యువ మోర్చా అధ్యక్షుడు రఘువీర్ సింగ్ జడేజా పిలుపునిచ్చారు. అంతేకాకుండా, ఈ ఉత్సవాల్లో పాల్గొనే హిందువులు తమ శరీరంపై, తలపై గోమూత్రాన్ని చిలకరించుకోవాలని ఆయన సూచించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... దసరాలో భాగంగా వైభవంగా జరిగే 'గార్బా' కార్యక్రమాల్లో ముస్లింలను నిషేధిస్తున్నట్టు తెలిపింది. విశ్వహిందూ పరిషత్ తో సన్నిహిత సంబంధాలున్న ఈ కాషాయ కమిటీ, గార్బా ఈవెంట్లలో పాల్గొనే వారు తప్పనిసరిగా తిలకం ధరించాలని, తమ కార్యకర్తలు అన్ని చోట్లా జరిగే నవరాత్రి ఉత్సవాలపై నిఘాను పెట్టారని జడేజా తెలిపారు. 
 
అయితే జడేజా నేతల వ్యాఖ్యలపై బీజేపీ నేతలే మండిపడుతున్నారు. చాలా మంది హిందువులు రంజాన్ సందర్భంగా ఉపవాసాలు ఉంటారు. వినాయక చవితి ఉత్సవాల్లో ఎందరో ముస్లింలు పాల్గొంటారు. ఇప్పుడీ మతాల ప్రాతిపదిక ఏంటి? అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu