Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేర‌ళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ... సాధార‌ణ ప్ర‌యాణికుడిలా రైలులో ఇలా...

తిరువ‌నంత‌పురం : ఛోటామోటా నాయకులే కాదు.. మాజీ ఎమ్మెల్యేలు కూడా తమకు తాము వీఐపీలుగా భావించుకుంటూ, విలాసాలు కోరుతున్న రోజులివి. ఇలాంటి సమయంలో ఓ మాజీ ముఖ్యమంత్రి అతి సాధారణ వ్యక్తిలాగా స్లీపర్‌ క్లాస్‌ రైలు కపార్ట్‌మెంట్‌లో ప్రయాణించారు. ఎవరూ ఊహించని రీ

కేర‌ళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ... సాధార‌ణ ప్ర‌యాణికుడిలా రైలులో ఇలా...
, బుధవారం, 12 అక్టోబరు 2016 (12:31 IST)
తిరువ‌నంత‌పురం : ఛోటామోటా నాయకులే కాదు.. మాజీ ఎమ్మెల్యేలు కూడా తమకు తాము వీఐపీలుగా భావించుకుంటూ, విలాసాలు కోరుతున్న రోజులివి. ఇలాంటి సమయంలో ఓ మాజీ ముఖ్యమంత్రి అతి సాధారణ వ్యక్తిలాగా స్లీపర్‌ క్లాస్‌ రైలు కపార్ట్‌మెంట్‌లో ప్రయాణించారు. ఎవరూ ఊహించని రీతిలో 160 కిలోమీటర్లు మామూలు బోగీలో ప్రయాణించి.. తోటి ప్రయాణికులతో మమేకమయ్యారు. 
 
డాబూ, దర్పాలకు పోకుండా సామాన్యులతో మమేకమై.. సామాన్యుడిలా ఆయన చేసిన ప్రయాణంపై ఇప్పుడు సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయనే కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ. మొన్నటివరకు సీఎం పదవిలో ఉన్న ఈ కాంగ్రెస్‌ నాయకుడు స్లీపర్‌ క్లాస్‌ కపార్ట్‌మెంట్‌లో 160 కిలోమీటర్లు ప్రయాణించి కేరళ రాజధాని తిరువనంతపురం చేరుకున్నారు.
 
సోషల్‌ మీడియాలో ఆయన నిరాడంబర ప్రయాణం ఫొటోలు ఇప్పుడు హల్‌చల్‌ చేస్తున్నాయి. విమానాశ్రయాల్లో తమను వీఐపీల్లాగా చూడాలని, ప్రత్యేక ధరతో టికెట్లు ఇవ్వాలని, వీఐపీ లాంజ్‌లోకి అనుమతించాలని, ఇంకా కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కొందరు ఎంపీలు డిమాండు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో మాజీ సీఎం జరిపిన ఈ సాధారణ ప్రయాణాన్ని నెటిజన్లు కీర్తిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలితను పరామర్శిచేందుకు మోడీ రాలేదు.. ఎందుకని..? ఇదిగోండి రీజన్...?