Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కాంగ్రెస్ నుంచి బీజేపీ దొంగలించలేనిది లోగో ఒక్కటే: ఆనంద్ శర్మ

కాంగ్రెస్ నుంచి బీజేపీ దొంగలించలేనిది లోగో ఒక్కటే: ఆనంద్ శర్మ
, బుధవారం, 27 మే 2015 (19:25 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలన ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన పాలనకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సున్నా మార్కులు వేసిన తర్వాత కాంగ్రెస్ నేతలు బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించడంలో వేగం పెంచారు. ఈ క్రమంలో సీనియర్ నేత ఆనంద్ శర్మ మాట్లాడుతూ... బీజేపీ నాయకత్వంలోని సర్కారు తమ హయాంలోని అన్ని పథకాలను కాపీ కొట్టిందని విమర్శించారు. 
 
తమ నుంచి దొంగిలించలేనిది ఏదైనా ఉందంటే అది తమ పార్టీ లోగోయేనని ఆనంద్ శర్మ సెటైర్ వేశారు. యూపీఏ పథకాలకు పేర్లు మార్చి తమవేనని చెప్పుకుంటున్నారని తెలిపారు. ప్రధాని మోడీ బాధ్యతాయుతంగా మాట్లాడాలని, పారదర్శకంగా పనిచేయాలన్నారు. ఆనంద్ శర్మ కూడా మోడీ ప్రభుత్వాన్ని సూటు బూటు సర్కారంటూ ఎద్దేవా చేశారు.
 

Share this Story:

Follow Webdunia telugu