Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైతు ఆత్మహత్యలను ఎలా ఆపాలో చెప్పండి : మోడీ విజ్ఞప్తి

రైతు ఆత్మహత్యలను ఎలా ఆపాలో చెప్పండి : మోడీ విజ్ఞప్తి
, గురువారం, 23 ఏప్రియల్ 2015 (18:00 IST)
ఢిల్లీలో బుధవారం గజేంద్ర సింగ్ అనే రైతు ఆత్మహత్య సంచలనం సృష్టించిన నేపథ్యంలో లోక్ సభలో గందరగోళం నెలకొంది. దేశంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలను ఆపాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని ప్రజా ప్రతినిధులతో పాటు దేశ ప్రజలకు మోడీ విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యల ఘటనలు అత్యంత హృదయ విదారకమని మోడీ వ్యాఖ్యానించారు. 
 
రైతు ఆత్మహత్యలను ఎలా ఆపాలో తెలియాలని.. దీనిపై ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలను సహృదయంతో స్వీకరిస్తామని, మేలైన వాటిని ఎంపికచేసి అమలు చేస్తామని నరేంద్ర మోడీ అన్నారు. బాధిత రైతు కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలనని అన్న ఆయన కష్టాల్లో ఉన్న రైతులను ఒంటరిగా వదిలివేయబోమని వివరించారు. ప్రాణానికంటే విలువైనదేదీ లేదని మోడీ ఉద్ఘాటించారు.

Share this Story:

Follow Webdunia telugu