Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాణిజ్య అద్దెగర్భంపై నిషేధం : పెళ్లైన జంటలకు ఐదేళ్ల తర్వాత మాత్రమే సరోగసీ అవకాశం

పిల్లలు లేని దంపతులకు వరంగా మారిన సరోగసీ (అద్దెగర్భం) విధానాన్ని కొందరు దుర్వినియోగం చేస్తుండడంతో ఈ విధానాన్ని పూర్తిగా నిషేధించే ముసాయిదా బిల్లుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. చట్టబద్ధంగా

వాణిజ్య అద్దెగర్భంపై నిషేధం : పెళ్లైన జంటలకు ఐదేళ్ల తర్వాత మాత్రమే సరోగసీ అవకాశం
, గురువారం, 25 ఆగస్టు 2016 (09:43 IST)
పిల్లలు లేని దంపతులకు వరంగా మారిన సరోగసీ (అద్దెగర్భం) విధానాన్ని కొందరు దుర్వినియోగం చేస్తుండడంతో ఈ విధానాన్ని పూర్తిగా నిషేధించే ముసాయిదా బిల్లుకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. చట్టబద్ధంగా వివాహం చేసుకున్న వారు మాత్రమే (వివాహమైన ఐదేళ్ల వరకు పిల్లలు పుట్టకుంటే) ఈ విధానం ద్వారా పిల్లలు పొందేందుకు వీలు కల్పించనున్నారు. 
 
సరోగసీ (నియంత్రణ) బిల్లు 2016ను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు అంగీకారం తెలిపింది. విదేశీయులు అక్రమంగా భారత్‌లో అద్దెగర్భం ద్వారా సంతానాన్ని పెంచుకోవటంతో.. వాణిజ్య సరోగసీకి భారత్ కేంద్రంగా మారిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లు అమలయ్యాక అక్రమ చర్యలకు పాల్పడే వారికి పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 లక్షల జరిమానా విధించనున్నారు. సెలబ్రిటీలు, డబ్బున్న కుటుంబాల్లో సరోగసి ద్వారా పిల్లలను కనటం ఫ్యాషన్ (పురిటి నొప్పుల బాధపడకుండా) అయిపోయిందని సుష్మ విమర్శించారు.  
 
ఈ బిల్లులోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. వివాహమైన ఐదేళ్లు దాటిన జంటలకే అవకాశం కల్పిస్తారు. భార్య వయసు 23-50 మధ్యలో, భర్త వయసు 26-55 మధ్యలో ఉండాల్సి ఉంటుంది. దంపతుల్లో ఒకరికి పిల్లలు కనేందుకు అవసరమైన సామర్థ్యం తక్కువగా ఉంది/లేదు అనే సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. సంతానం లేని దంపతులకు మాత్రమే అద్దెగర్భం ద్వారా తల్లిదండ్రులయ్యే వారికి మాత్రమే ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. అద్దెగర్భం ద్వారా పుట్టిన పిల్లలకు ఆస్తిపై సంపూర్ణ హక్కు కల్పిస్తారు. గర్భాన్ని అద్దెకిచ్చే మహిళ ఖచ్చితంగా వివాహిత అయి ఉండాలి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైక్రోబయాలజీ విద్యార్థిపై గ్యాంగ్ రేప్... కామాంధుల కోసం గాలింపు