Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికా టూర్ ఓవర్.. ఇక మహారాష్ట్ర ప్రచారం స్టార్ట్స్!

అమెరికా టూర్ ఓవర్.. ఇక మహారాష్ట్ర ప్రచారం స్టార్ట్స్!
, బుధవారం, 1 అక్టోబరు 2014 (19:18 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ముగించుకున్నారు. అమెరికా టూర్ సక్సెస్ కావడంతో మహారాష్ట్ర ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోడీ బరిలోకి దిగనున్నారు. 
 
శివసేనతో దోస్తీ చెడిన నేపథ్యంలో మోడీ మేనియాను వినియోగిస్తే కానీ, ఆ రాష్ట్రంలో పార్టీ గట్టెక్కే పరిస్థితి లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భావిస్తున్నారు. దీంతో, వీలయినంత మేర మోడీని వాడుకోవాలని ఆయన నిర్ణయించారు.
 
ఇక, భారత వాణిజ్య రాజధానిగా భాసిల్లుతున్న మహారాష్ట్ర రాజధాని ముంబై మహా నగరంలో మొత్తం 36 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో మెజార్టీ సీట్లు ఎవరికైతే దక్కుతాయో, వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 
 
ప్రస్తుతం 2009లో జరిగిన ఎన్నికల్లో ముంబైలో 13 చోట్ల పోటీ చేసిన బీజేపీ ఐదింట విజయం సాధించింది. తాజాగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ, మోడీ చేత ప్రచారం చేయించి మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలని యోచిస్తోంది. మరోవైపు శివసేన ఇతరత్రా పార్టీలు బీజేపీని ఓడించాలని ఉవ్విళ్లూరుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu