Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేతాజీ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించండి.. తేలిపోద్ది: అనితాబోస్

నేతాజీ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించండి.. తేలిపోద్ది: అనితాబోస్
, బుధవారం, 27 జనవరి 2016 (12:42 IST)
నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని నేతాజీ కుమార్తె అనితాబోస్ డిమాండ్ చేశారు. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తే.. ఆ అస్థికలు తన తండ్రివో కావో తేలుతుందన్నారు. తైపీలోని తైహో విమానాశ్రయం సమీపంలో 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించారని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. 
 
ప్రస్తుతం జర్మనీలో ఉంటున్న తాను వచ్చేనెల భారత్‌కు వచ్చే అవకాశం ఉందని.. ఆ పర్యటన సందర్భంగా తన తండ్రి అస్థికలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని స్వయంగా విజ్ఞప్తి చేస్తానని వెల్లడించారు.

ఇటీవల విడుదల చేసిన డిజిటల్ పత్రాల ద్వారా నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటపడుతున్న నేపథ్యంలో.. జపాన్‌లోని టోక్యో రెంకోజీ ఆలయంలో ఉన్న బోస్ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో అనితాబోస్ డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu