Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాఠశాల బాలికను గర్భవతిని చేసి... పరారైన ఉపాధ్యాయుడు

బాలబాలికలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారిపోయాడు. నవీ ముంబైలో ఓ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు తన వద్ద చదివే ఓ విద్యార్థిని గర్భవతిని పారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలన

పాఠశాల బాలికను గర్భవతిని చేసి... పరారైన ఉపాధ్యాయుడు
, సోమవారం, 12 డిశెంబరు 2016 (11:10 IST)
బాలబాలికలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారిపోయాడు. నవీ ముంబైలో ఓ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు తన వద్ద చదివే ఓ విద్యార్థిని గర్భవతిని పారిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాలను పరిశీలిస్తే...
 
నవీముంబైకు చెందిన 42 ఏళ్ల ఉపాధ్యాయుడే 13 ఏళ్ల ఓ బాలికను పాఠశాల తరగతి గదికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం జరిపాడు. ఇలా రెండు సార్లు స్కూలులోనే ఏప్రిల్, ఆగస్టు నెలల్లో ఆ బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేశాడు. బాలిక కడుపునొప్పిగా ఉందని తల్లికి చెప్పడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లి డాక్టరుకు చూపించగా బాలిక నాలుగువారాల గర్భవతి అని తేలింది. దీంతో షాక్ తిన్న బాలిక తల్లి ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోలీసులు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నీరుల్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అత్యాచారం జరిపిన ఉపాధ్యాయుడు కోపర్ ఖైరేన్‌లో నివాసముంటున్నడని అతనికి భార్య, ఒక కుమారుడున్నారని పోలీసులు చెప్పారు. అయితే ఈ కేసు అనంతరం ఉపాధ్యాయుడు పరారీలో ఉన్నాడు. అతని ఫోన్ కూడా స్విచాఫ్ చేయడంతో పాటు అతనితోపాటు అతని కుటుంబసభ్యుల ఆచూకీ కూడా తెలియలేదు. 
 
దీంతో పోలీసు నివేదిక మేరకు సదరు కీచక ఉపాధ్యాయుడిని ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. కీచక ఉపాధ్యాయుడు ఢిల్లీల్లో ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఢిల్లీకి పంపించి నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వార్దా తుఫాన్ ఎఫెక్ట్.. చెన్నైలో ఉగ్రరూపం దాల్చిన సముద్రం.. ఆందోళనలో చెన్నై వాసులు