Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్డీయే ఎంపీలకు 26న నరేంద్ర మోడీ తేనీటి విందు!

ఎన్డీయే ఎంపీలకు 26న నరేంద్ర మోడీ తేనీటి విందు!
, గురువారం, 23 అక్టోబరు 2014 (19:37 IST)
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఘన విజయంతో ఉత్సాహంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఎంపీలకు ఈనెల 26వ తేదీ ఆదివారం తేనీటి విందును ఇవ్వనున్నారు. ప్రధాని నివాసంలో జరిగే ఈ విందుకు శివసేన ఎంపీ, కేంద్ర మంతి అనంత్‌ గీతే కూడా హాజరు కానున్నారు. తేనీటి విందు విషయాన్ని గీతేనే వెల్లడించడం విశేషం. 
 
కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఎన్డీయే ఎంపీలతో భేటీ అవ్వడం ఇదే తొలిసారి. ఎన్డీయే ఎంపీలందరినీ ప్రధాని టీకి ఆహ్వానించారు. అక్టోబర్‌ 26న ప్రధాని నివాసంలో ఈ కార్యక్రమం ఉంటుంది. ఎన్డీయేలో శివసేన కూడా భాగం కనుక.. నాతో సహా శివసేన ఎంపీలందరూ హాజరవుతారు అని గీతే వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu