Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మందేయడానికి డబ్బులివ్వలేదని కన్నతల్లిని చితకబాదాడు.. వేటకొడవలితో నరికేసింది..

మందేయడానికి డబ్బులివ్వాలని రోజూ వేధించే కన్నకొడుకును ఆ తల్లి చంపేసింది. ప్రతినెల కట్టే చిట్టీ డబ్బును మందు కొట్టడానికి కాజేసేందుకు ప్రయత్నించిన కొడుకును కన్నతల్లి కత్తితోనరికి చంపిన ఉదంతం నామక్కల్‌ జి

మందేయడానికి డబ్బులివ్వలేదని కన్నతల్లిని చితకబాదాడు.. వేటకొడవలితో నరికేసింది..
, మంగళవారం, 1 నవంబరు 2016 (12:15 IST)
మందేయడానికి డబ్బులివ్వాలని రోజూ వేధించే కన్నకొడుకును ఆ తల్లి చంపేసింది. ప్రతినెల కట్టే చిట్టీ డబ్బును మందు కొట్టడానికి కాజేసేందుకు ప్రయత్నించిన కొడుకును కన్నతల్లి కత్తితోనరికి చంపిన ఉదంతం నామక్కల్‌ జిల్లా రాశిపురం సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రాశిపురం, కోనేరిపట్టికాట్టుకోట్టాయ్‌ ప్రాంతంలో అన్నాదురై (46) అనే చేనేత కార్మికుడు, భార్య సుమతి, పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. అన్నాదురై తల్లి లక్ష్మి కూడా ఆ ఇంట్లోనే ఉంటుంది. లక్ష్మి భర్త లక్ష రూపాయల చిట్టీకి సంబంధించి పది నెలసరి వాయిదాలు చెల్లించి ఆపై కట్టలేకపోయాడు. ఈ మొత్తాన్ని లక్ష్మి కష్టాలు పడి తొమ్మిది వాయిదాలు చెల్లించేసింది. ఇంకా ఒకే నెల వాయిదా కడితే లక్ష రూపాయల చిట్టీ సొమ్ము లక్ష్మీ చేతికి అందుతుంది. 
 
ఈ విషయం తెలుసుకున్న అన్నాదురై ఫూటుగా తాగొచ్చి తల్లి లక్ష్మీతో గొడవపడుతుండేవాడు. వృద్ధాప్యంలో లక్ష రూపాయలు ఏం చేసుకుంటావ్.. తనకిచ్చేయ్ అంటూ అమ్మను చితకబాదేవాడు. కన్నకొడుకు వేధింపులు తాళలేకపోయింది. ఆదివారం తాగొచ్చి గొడవ చేసిన అన్నాదురైని వేటకొడవలితో నరికేసింది. అనంతరం పోలీసుల ముందు లొంగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో పటిష్ట భద్రత