Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముంబయిలో కేంద్ర మాజీ మంత్రి మురళీదేవ్‌రా కన్నుమూత

ముంబయిలో కేంద్ర మాజీ మంత్రి మురళీదేవ్‌రా కన్నుమూత
, సోమవారం, 24 నవంబరు 2014 (09:24 IST)
సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి మురళీదేవరా (77) అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజూమున 3.25 గంటలకు ముంబయిలో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. 
 
ముంబయిలో జన్మించిన దేవరా.. రాజస్థాన్ కుటుంబానికి చెందిన వారు. పారిశ్రామిక కుటుంబానికి చెందిన మురళీదేవరా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. 
 
ఆయన తొలుత ముంబయి మున్సిపల్ కార్పోరేషన్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడుగా ముంబయిలో 22 ఏళ్లపాటు పని చేశారు. 
 
గత 2006న యూపీఏ హయాంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా కూడా మురళీదేవరా బాధ్యతలు వహించారు. అయితే పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన పదవి నుంచి పక్కకు తప్పుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu