Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాహుల్ గాంధీకి నోటీసులు.. కోర్టుకు రావాల్సిందే..!

రాహుల్ గాంధీకి నోటీసులు.. కోర్టుకు రావాల్సిందే..!
, సోమవారం, 30 మార్చి 2015 (19:26 IST)
రాహుల్ గాంధీ కోర్టుకు హాజరు కావాల్సిందేనని మహారాష్ట్రలోని భివాండీ కోర్టు స్పష్టం చేసింది. ఆర్ఎస్ఎస్ నేత రాజేష్ కుంటే దాఖలు చేసిన పరువు నష్టం కేసులో రాహుల్ కోర్టుకు గైర్హాజరవడంతో కోర్టు సమన్లు ఇచ్చింది. 
 
వ్యక్తిగత కారణాల రీత్యా విచారణకు హాజరుకాలేకపోతున్నారంటూ రాహుల్ న్యాయవాది దాఖలు చేసిన పిటిషణ్‌ను కోర్టు తిరస్కరించింది. మే 8న కోర్టుకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీచేసింది. కాగా గతేడాది లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ఎస్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్‌పై పరువునష్టం కేసు దాఖలైంది.

Share this Story:

Follow Webdunia telugu