Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చాలా పశ్చాత్తాపపడుతున్నా... అశోక్ గజపతిరాజుకు గైక్వాడ్ లేఖ...

తను ఎయిరిండియా మేనేజర్ పైన చేసిన దాడిపై చింతిస్తున్నట్లు శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఓ లేఖ రాశారు. సిబ్బందిపై చెప్పుతో దాడి చేయడమే కాక ఇవాళ పార్లమెంటులోనూ ఏకంగా కేంద్ర విమానయాన శాఖమంత్రి అశోక్‌ గజపతిరాజు పైన దాడికి యత్నించడం తీవ్ర చర్చనీయాంశంగా మారి

చాలా పశ్చాత్తాపపడుతున్నా... అశోక్ గజపతిరాజుకు గైక్వాడ్ లేఖ...
, గురువారం, 6 ఏప్రియల్ 2017 (22:05 IST)
తను ఎయిరిండియా మేనేజర్ పైన చేసిన దాడిపై చింతిస్తున్నట్లు శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఓ లేఖ రాశారు. సిబ్బందిపై చెప్పుతో దాడి చేయడమే కాక ఇవాళ పార్లమెంటులోనూ ఏకంగా కేంద్ర విమానయాన శాఖమంత్రి అశోక్‌ గజపతిరాజు పైన దాడికి యత్నించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనువెంటనే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ మంత్రి గజపతిరాజుకు లేఖ రాశారు గైక్వాడ్. ఈ లేఖతో ఆయనపై ఎయిరిండియాలో తిరగకుండా విధించిన నిషేధం ఎత్తివేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
 
ఐతే చెప్పుతో కొట్టినవారికి మాత్రం ఆయన క్షమాపణలు చెప్పేది లేదని గతంలో చెప్పారు. ఇపుడు కూడా మంత్రిగారికి లేఖలో పశ్చాత్తాపం చెందుతున్నట్లు రాశారు కానీ, నేరుగా సిబ్బందికి సారీ చెప్పరన్నమాట. శివసేన ఎంపీ ఇంకో మెట్టు దిగి వారికి కూడా క్షమాపణలు చెబితే మంచిదేమో...?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కవితను ఎంపీగారూ అని పిలిచేందుకు ఇబ్బందిగా ఉంది.. నా భార్య సలహా తీసుకున్నా: కేటీఆర్