Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హిందువులు తక్కువ మందినే కనాలని ఏ చట్టం చెప్పింది: మోహన్ భగవత్

హిందువులు తక్కువ మంది పిల్లలను కనాలని ఏ చట్టం చెప్పిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశ్నినించారు. భారత అన్నా హిందూ అన్నా ఒకటేనని, ఇండియాను ప్రపంచమంతా 'హిందూ' అనే అభివర్ణిస్తుందని స్పష్టం చేశారు.

హిందువులు తక్కువ మందినే కనాలని ఏ చట్టం చెప్పింది: మోహన్ భగవత్
, సోమవారం, 22 ఆగస్టు 2016 (11:34 IST)
హిందువులు తక్కువ మంది పిల్లలను కనాలని ఏ చట్టం చెప్పిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశ్నినించారు. భారత అన్నా హిందూ అన్నా ఒకటేనని, ఇండియాను ప్రపంచమంతా 'హిందూ' అనే అభివర్ణిస్తుందని స్పష్టం చేశారు. 
 
ఉత్తరప్రదేశ్‌లో ఆగ్రాలోని బ్రాజ్‌ ప్రాంతంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పెద్దఎత్తున హాజరైన యూనివర్సిటీలు, కాలేజీ అధ్యాపకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. హిందూ సంస్కృతి, హిందువుగా ఉండటంపై ఆయన మాట్లాడారు. ఆర్‌ఎస్ఎస్‌లో చేరాలని అధ్యాపకులను కోరారు. వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా తాము వ్యవస్థను ఎలా మార్చామో చూడాలని కోరారు. 
 
తమ సంస్థ పేరు హిందూతో కానీ భారతీయతో కానీ ప్రారంభం కాలేదని, రాష్ట్రీయతో ప్రారంభమైందని, ఎందుకంటే, దానికి అన్నీ సమానార్థకాలేనని వ్యాఖ్యానించారు. కుటుంబ విలువలను పెంచడానికి కృషి చేయాలని, పిల్లల్లో దేశభక్తిని పెంచాలని అధ్యాపకులను కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేస్‌బుక్ పరిచయం... ఆర్మీ జవానుతో యువతి ప్రేమాయణం.. పెళ్లికి అడ్డు చెపుతున్నది ఎవరు?