Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వచ్ఛ్ భారత్‌‌లో ఒమర్ అబ్ధుల్లా: మోడీ ప్రశంస, సల్మాన్‌కు థ్యాంక్స్

స్వచ్ఛ్ భారత్‌‌లో ఒమర్ అబ్ధుల్లా: మోడీ ప్రశంస, సల్మాన్‌కు థ్యాంక్స్
, శుక్రవారం, 24 అక్టోబరు 2014 (14:49 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్ధుల్లా పాలుపంచుకున్నారు. శ్రీనగర్‌లో అతను చీపురు పట్టాడు. వీధులను శుభ్రం చేశాడు. ఒమర్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడంపై మోడీ ట్వీట్ చేశారు.
 
ఒమర్ అబ్ధుల్లాను మోడీ కొనియాడారు. స్వచ్ఛ భారత్‌లో ఒమర్ పాలుపంచుకోవడం జమ్ము కాశ్మీర్ ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారని, ఇది కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డారు.
 
ఒమక్ అబ్దుల్లా బుధవారం రాత్రి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీనగర్ మున్సిపల్ కార్పోరేషన్ అధికారులతో కలిసి ఆయన వరదల ప్రభావిత ప్రాంతాలలో నగరాన్ని శుభ్రం చేశారు.
 
ఇంకా... తనను నామినేట్ చేసినందుకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు ఒమర్ అబ్దుల్లా ధన్యవాదాలు తెలిపారు. ఇదిలా ఉండగా, దీపావళి పర్వదినం నాడు నరేంద్ర మోడీ జమ్ము కాశ్మీర్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu