Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్వచ్ఛ్ భారత్: కమల్‌తో పాటు 9మంది సెలబ్రిటీలకు మోడీ ఛాలెంజ్!

స్వచ్ఛ్ భారత్: కమల్‌తో పాటు 9మంది సెలబ్రిటీలకు మోడీ ఛాలెంజ్!
, గురువారం, 2 అక్టోబరు 2014 (15:23 IST)
ఐస్ బకెట్ ఛాలెంజ్‌లా స్వచ్ఛ్ భారత్ వ్యాపిస్తోంది. మొన్నటిదాకా ఐస్ బకెట్ ఛాలెంజ్‌లో భాషా బేదం లేకుండా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్, కోలీవుడ్ సెలేబ్రిటీలు పాల్గొన్నారు. ఇప్పుడు తాజాగా దేశంలోని తొమ్మిది మంది సెలెబ్రిటీలకు ప్రధాని మోడీ సవాల్ విసిరారు.
 
గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛమైన భారత్‌ని రూపొందించడంలో భారతీయులందరూ కలిసి పాల్గొనవలసిందిగా ప్రజలందరికీ పిలుపునిచ్చారు మోడీ. “స్వచ్ఛ భారత్” కార్యక్రమంలో పాల్గొన్న మోడీ బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్యంలో పాల్గొనమని దేశంలోని సెలెబ్రిటీలకు సవాల్ విసిరారు. 
 
ఆ తొమ్మిది మంది సెలేబ్రిటీలు స్వచ్ఛ్ భారత్‌లో పాల్గొని మరో తొమ్మిది మందికి ఈ కార్యక్రమంలో పాల్గొనమని ఆహ్వానం పలకాలని ప్రధాని పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్‌లో మోడీతో పాటు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా పాల్గొన్నారు.
 
నరేంద్ర మోడీ సవాల్ విసిరిన ఆ సెలేబ్రిటీలు కమల్ హాసన్, సల్మాన్ ఖాన్, ప్రియాంకా చోప్రా, శశిథరూర్, సచిన్ టెండూల్కర్, తారక్ మెహతా, అనిల్ అంబానీ, మృదులా సిన్హా, బాబా రాందేవ్‌లు ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu