Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు జాతీయ సెలవు దినం... ఢిల్లీకి రానున్న కలాం పార్థివదేహం.. కేబినెట్ సమావేశం

నేడు జాతీయ సెలవు దినం... ఢిల్లీకి రానున్న కలాం పార్థివదేహం.. కేబినెట్ సమావేశం
, మంగళవారం, 28 జులై 2015 (06:10 IST)
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాపంగా నేడు జాతీయసెలవు దినంగా పాటించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. నేడు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూసి ఉంచాలని ఆయన ఆదేశించారు. ఇదిలా ఉండగా, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పార్థివదేహంమంగళవారం ఉదయం బెథానీ ఆసుపత్రి నుంచి ఢిల్లీకి తరలించనున్నట్లు రక్షణశాఖ పీఆర్వో అమిత్‌ మహాజన్‌ తెలిపారు. 
 
ఉదయం 5.30గంటలకు వైమానిక దళ హెలికాప్టర్‌లో గువహటికి తరలించి అక్కడి నుంచి ఉదయం 6.30 గంటలకు ప్రాంతంలో దిల్లీకి తీసుకురానున్నట్లు ఆయన పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మృతికి సంతాపంగా మంగళవారం పార్లమెంట్‌ కేబినెట్‌ సమావేశం కానున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఉదయం 10గంటలకు జరిగే ఈ సమావేశంలో కలాంకు శ్రద్ధాంజలి ఘటించనున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu