Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉత్తరప్రదేశ్‌లో 14 యేళ్ల బాలిక కిడ్నాప్.. గ్యాంగ్ రేప్!

ఉత్తరప్రదేశ్‌లో 14 యేళ్ల బాలిక కిడ్నాప్.. గ్యాంగ్ రేప్!
, ఆదివారం, 31 ఆగస్టు 2014 (13:57 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 14 యేళ్ల బాలికను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు వివరాలను పరిశీలిస్తే.. బారాబంకీలోని రామ్ నగర్ ప్రాంతంలో 14 యేళ్ల బాలిక పాఠశాలకు వెళ్లి వస్తుండగా, నలుగురు దుండగులు అపహరించి ఆపై బాలికపై సామూహిక అత్యాచారం జరిపారు. 
 
జరిగిన ఘోరాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు ఎట్టకేలకు ముగ్గురు నిందితులు అక్బర్, జబ్బీర్, ఈబ్బాల్‌లను అరెస్ట్ చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ కులదీప్ నారాయణ్ తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం బారాబంకీ ఆస్పత్రికి తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu