Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెంగళూరు పాఠశాలలో మూడేళ్ల బాలికపై అత్యాచారం

బెంగళూరు పాఠశాలలో మూడేళ్ల బాలికపై అత్యాచారం
, బుధవారం, 22 అక్టోబరు 2014 (09:22 IST)
కర్ణాటక రాజధాని బెంగుళూరు నగరంలో ఒక ప్రైవేటు స్కూల్‌లో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. నగరంలోని జలహళ్లి ప్రాంతంలో ఉన్న స్కూలు నుంచి పాపను తీసుకురావడానికి తండ్రి వెళ్లగా ఆమె బాగా ఏడుస్తోందని, ఆమెకు జ్వరం కూడా ఉందని ఆయన ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తొలుత ఎవరో తనను కొట్టారని చెప్పినా, తర్వాత తల్లికి జరిగిన విషయం చెప్పిందన్నారు. 
 
సమాచారం అందుకున్న వెంటనే పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి పాఠశాలకు వెళ్లి ప్రాధమిక విచారణ చేపట్టారు. అనంతరం ఈ కేసు బాధ్యతలను మల్లేశ్వరం ఏసీపీ సారా ఫాతిమాకు అప్పగించారు. స్కూలు సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నామని, సిబ్బంది అందరినీ ప్రశ్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. 
 
కాగా గత నాలుగు నెలల్లో ఇటువంటి సంఘటన మూడోది కావడం గమనార్హం. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోస్కో చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ 376 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అభంశుభం తెలియని పసికందుపై అగాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తి కోసం పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu