Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆవేశంతో కన్నకుమార్తెను నరికాడు.. భార్య, మరదలిపై కత్తితో దాడి!

ఆవేశంతో కన్నకుమార్తెను నరికాడు.. భార్య, మరదలిపై కత్తితో దాడి!
, సోమవారం, 16 జూన్ 2014 (13:28 IST)
క్షణికావేశంలో ఓ వ్యక్తి తన ఐదేళ్ల కూమార్తెను హతమార్చాడు. అంతటితో ఆగక భార్యను, మరదలిని, మేనకోడలిని చంపేందుకు ప్రయత్నించాడు. భార్యతో గొడవ పడిన అతడు కోపంతో భార్యను, మరదలిని, మేనకోడలిని కత్తితో పొడిచి గాయపరిచాడు. అంతే కాకుండా అతడు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన ఒడిషాలోని భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది.

భువనేశ్వర్‌కు చెందిన సుబోధ్ సాహు (37) అనే వ్యక్తి కియోంఝర్‌లో పనిచేస్తున్నాడు. ఆయన కుటుంబం మొత్తం భువనేషశ్వర్‌లో ఉంటోంది. ఈ నేపథ్యంలో అతని భార్య వేరు కాపురం పెడదామని ఒత్తిడి తెస్తోంది. దీనిపై వీరిమధ్య గోడవలు వస్తూనే వున్నాయి. తాజాగా ఇదే విషయంపై గొడవ రావడంతో ఆగ్రహం చెందిన సుబోధ్ తన ఐదేళ్ల కుమార్తె సిమ్రన్ను నరికి చంపేశాడు.

ఆ తర్వాత వరుసగా తన భార్యను, మరదలిని, మేనకోడలిని కూడా కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. ఇదంతా అయిన తర్వాత అతడు విషం తాగి, సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేయగా, ఇరుగు పొరుగులు అతడిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu