'థాంక్యూ, ప్రెస్మీట్ అయిపోయింది.. ఇక వెళ్లి టీ తాగండి' : ముఫ్తీ
'థాంక్యూ, ప్రెస్మీట్ అయిపోయింది.. ఇక వెళ్లి టీ తాగండి' అని తనను కలిసిన విలేకరుతో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. గతంలో మీరు కాశ్మీర్లో భద్రతాదళాల మోహరింపును, కర్ఫ్యూల విధింపును వ్యతిరేకించారు కద
'థాంక్యూ, ప్రెస్మీట్ అయిపోయింది.. ఇక వెళ్లి టీ తాగండి' అని తనను కలిసిన విలేకరుతో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. గతంలో మీరు కాశ్మీర్లో భద్రతాదళాల మోహరింపును, కర్ఫ్యూల విధింపును వ్యతిరేకించారు కదా అని విలేకరులు ప్రశ్నించారు. దీంతో ఆమెకు ఎక్కడలేని కోపం వచ్చింది.
తాను చెప్పదలచుకున్న నాలుగు ముక్కలు చెప్పేసి.. ''థాంక్యూ, ప్రెస్మీట్ అయిపోయింది.. ఇక వెళ్లి టీ తాగండి' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ సాక్షిగానే ఇదంతా జరిగింది. 2010లో కూడా ఇలాగే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పుడు మీ విధానం వేరుగా ఉంది కదా అని విలేకరులు పదే పదే ప్రశ్నించడంతో ఆమెకు కోపం వచ్చింది.
బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ అనంతరం రాష్ట్రంలో హింస చెలరేగిన తర్వాత తొలిసారిగా ఆమె మీడియా ముందుకు వచ్చారు. 2010 అల్లర్లను నాటి సీఎం ఒమర్ అబ్దుల్లా సరిగా నియంత్రించలేదని, అందుకే వంద మందికి పైగా మరణించారని మెహబూబా చెప్పారు. ప్రస్తుత ఆందోళనను కేవలం 5 శాతం మంది మాత్రమే సమర్థిస్తున్నారని, మిగిలిన 95 శాతం మంది శాంతినే కోరుకుంటున్నారని అన్నారు.