Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

472 మంది మావోయిస్టులు లొంగిపోయారు : కేంద్ర హోంశాఖ!

472 మంది మావోయిస్టులు లొంగిపోయారు : కేంద్ర హోంశాఖ!
, బుధవారం, 26 నవంబరు 2014 (13:03 IST)
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ యేడాది అక్టోబర్ 31వ తేదీ నాటికి 472 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఈ విషయాన్ని పార్లమెంట్ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో ఆ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. గతేడాది 283 మంది మావోయిస్టులు లొంగిపోయారని, ఈ సంఖ్య ఈ ఏడాది భారీగా పెరిగిందని పేర్కొంది. ఇటీవలి కాలంలో 2014లోనే అధిక సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాట పట్టారని వెల్లడించింది. 
 
మావోల లొంగుబాటలో ఛత్తీస్‌గఢ్ తొలి స్థానంలో నిలుస్తున్నప్పటికీ, అక్కడే మావో కార్యకలాపాలు ఎక్కువగా నమోదయ్యాయని కూడా పేర్కొంది. అంతేకాక ఈ యేడాదిలోనే ఆ రాష్ట్ర పోలీసులు అత్యధిక సంఖ్యలో 387 మందిని అరెస్ట్ చేశారని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ లో ఈ యేడాది అక్టోబర్ దాకా 76 మంది మావోయిస్టులు లొంగిపోయారు. గతేడాది మొత్తంలో ఈ సంఖ్య 82గా నమోదైంది. 

Share this Story:

Follow Webdunia telugu