హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. హర్యానాలో రాష్ట్రంలో ఏర్పాటైన తొలి బీజేపీ ప్రభుత్వం ఇదే కావడం గమనార్హం.
హర్యానాలోని పంచకులలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఉదయం 11.22 గంటలకు హర్యానా గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకీ, ఖట్టర్తో ప్రమాణం చేయించారు. తద్వారా హర్యానాకు తొలి బీజేపీ సీఎంగా ఖట్టర్ రికార్డులకెక్కారు.
కాగా, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్తో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.