Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏటికెదురెళ్లాడు... బైక్‌తో పాటు నీటి ప్రవాహంలో కొట్టుకెళ్లాడు

ఏటికెదురెళ్లాడు... బైక్‌తో పాటు నీటి ప్రవాహంలో కొట్టుకెళ్లాడు
, మంగళవారం, 22 జులై 2014 (18:46 IST)
మధ్యప్రదేశ్‌లో భారీగా కురిసిన వర్షాలకు వంతెనపై నీరు ఉప్పొంగి రోడ్డుపైకి ఉరవడితో వెళ్తున్నా పట్టించుకోకుండా ఏటికెదురెళ్లిన ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మధ్యప్రదశ్ రాష్ట్రంలోని బైతుల్ జిల్లాలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వర్షం అప్పుడే వెలిసింది. కానీ నీటి ప్రవాహం విపరీతంగా ఉరవడితో ప్రవహిస్తుంది. ఆ ప్రవాహ ఉధృతి రోడ్డుపైకి వచ్చేసింది. 
 
ఐతే నీటి ప్రవాహం అంత లోతుగా ఉన్నట్లు కనబడకపోయేసరికి బైకుపై అవతలి ఒడ్డుకు వెళ్లేందుకు అతడు ప్రయత్నించాడు. అయితే, అతడు ఊహించని విధంగా ప్రవాహం మరింత వేగంగా రావడంతో బైకుతో సహా అతడు ప్రవాహంలోకి పడిపోయి కొట్టుకుపోయాడు. అందరూ చూస్తుండగానే అతడు నీటి ప్రవాహంలో కలిసిపోయాడు.

Share this Story:

Follow Webdunia telugu