Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బీహార్ రిజల్ట్స్ : నితీశ్‌కు నరేంద్ర మోడీ - చంద్రబాబు - సిద్ధరామయ్య అభినందనలు

బీహార్ రిజల్ట్స్ : నితీశ్‌కు నరేంద్ర మోడీ - చంద్రబాబు - సిద్ధరామయ్య అభినందనలు
, ఆదివారం, 8 నవంబరు 2015 (14:01 IST)
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు నితీశ్‌కు ఫోన్లు చేసిమరీ తమ అభినందనలు తెలిపారు. 
 
ఆదివారం వెల్లడైన బీహార్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి భారీ ఆధిక్యంతో ఉండటాన్ని గమనించిన నరేంద్ర మోడీ.. నితీశ్‌కు స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపాు. మూడోసారి బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నందుకు నితీశ్ కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
 
అలాగే, బీహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించబోతున్న సీఎం నితీశ్ కుమార్‌కు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం నితీశ్‌కు ఫోన్ చేసిన చంద్రబాబు ఎన్నికల్లో విజయం పట్ల ఆయనకు అభినందనలు తెలిపారు. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా నితీశ్ కుమార్‌కు అభినందనలు తెలిపారు. బీహార్‌లో మహా కూటమి విజయం అభివృద్ధికి ప్రజలు కట్టబెట్టిన విజయమని వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu