Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అళగిరిపై భూకబ్జా కేసు: సెప్టెంబర్ 3వరకు బెయిల్

అళగిరిపై భూకబ్జా కేసు: సెప్టెంబర్ 3వరకు బెయిల్
, శనివారం, 30 ఆగస్టు 2014 (16:08 IST)
భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో డీఎంకే అధ్యక్షులు, మాజీ తమిళనాడు సీఎం కరుణానిధి కుమారుడు, ఆ పార్టీ మాజీ నేత ఎంకే అళగిరిపై మధురై పోలీసులు కేసు నమోదు చేశారు.
 
ఫిర్యాదులో.. మధురైలో అళగిరికి చెందిన 'దయ ఇంజనీరింగ్ కాలేజ్' బయట 44 సెంట్ల భూమి ఉంది. దాన్ని నకిలీ పత్రాలతో కళాశాల వారు ఆక్రమించుకున్నారని ఆరోపించారని పోలీసులు తెలిపారు.
 
ఈ నేపథ్యంలో అళగిరిని అరెస్టుచేసే అవకాశం ఉందంటున్నారు. అటు ఆయనపై చేస్తున్న ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపించినవేనని సన్నిహితులు అంటున్నారు. అయితే అళగిరికి సెప్టెంబర్ 3వ తేదీ వరకు మద్రాస్ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu