Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేను సైతాన్‌ను అయితే.. నరేంద్ర మోడీ బ్రహ్మపిశాచి : లాలూ ప్రసాద్

నేను సైతాన్‌ను అయితే.. నరేంద్ర మోడీ బ్రహ్మపిశాచి : లాలూ ప్రసాద్
, శుక్రవారం, 9 అక్టోబరు 2015 (17:11 IST)
తనపై విమర్శలు గుప్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. తనను సైతాన్‌గా అభివర్ణించిన మోడీని లాలూ ప్రసాద్ యాదవ్ బ్రహ్మపిశాచిగా అభివర్ణించారు. 
 
ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తన ప్రసంగంలో మత సహనం, భిన్నత్వంలో ఏకత్వం లాంటి విషయాల గురించి చెప్పింది ప్రధానిని ఉద్దేశించేనన్నారు. అందువల్ల ప్రణబ్ వ్యాఖ్యలను నరేంద్ర మోడీ గుర్తు చేయాల్సిన అవరం లేదని ఆయన గుర్తు పెట్టుకుంటే చాలన్నారు. 
 
కాగా, ఐదు దశల్లో జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రత్యర్థుల మధ్య విమర్శలు శ్రుతి మించుతున్నాయి. 'సైతాన్‌' అంటూ వ్యాఖ్యలు చేసిన మోడీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు ఆర్జేడీ సన్నద్ధమవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu