Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఢిల్లీ ఓటర్లకు ముత్యాల హారాన్ని ఇస్తున్న కిరణ్ బేడీ : ఆప్ ఫిర్యాదు!

ఢిల్లీ ఓటర్లకు ముత్యాల హారాన్ని ఇస్తున్న కిరణ్ బేడీ : ఆప్ ఫిర్యాదు!
, శుక్రవారం, 30 జనవరి 2015 (11:25 IST)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మహిళా ఓటర్లకు ముత్యాల హారాన్ని ఇస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఈ విషయం ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీ నేతల దృష్టికి వెళ్లడంతో వారు ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
 
దీనిపై ఆప్ నేత మనీష్ తివారీ స్పందిస్తూ.. తూర్పు ఢిల్లీలోని ప్రతాప్ గంజ్ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. వారు ప్రత్యక్షంగా నెక్లెస్‌లు ఇస్తూ, ఓటర్లను మభ్యపెడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తున్నట్టు స్పష్టంగా కనపడుతోందని ప్రకటించారు. కాగా, ఇతర పార్టీలు ఇచ్చే బహుమతులు తీసుకోవాలని, ఓటు మాత్రం తమకే వేయాలని కేజ్రీవాల్ అనడాన్ని ఎలక్షన్ కమిషన్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu