ప్రేమించి పెళ్లాడింది.. ప్రియుడి దగ్గరికెళ్లింది.. ఇద్దరూ వదిలేశారు.. రోడ్డున పడింది..
కేరళకు చెందిన ఒక యువతి ఒక యువకుడిని ప్రేమించి మరో యువకుడిని పెళ్లాడి... ఇప్పుడు ఇద్దరు చేతులు వదిలేయడంతో రోడ్డున పడింది.
కేరళకు చెందిన ఒక యువతి ఒక యువకుడిని ప్రేమించి మరో యువకుడిని పెళ్లాడి... ఇప్పుడు ఇద్దరు చేతులు వదిలేయడంతో రోడ్డున పడింది. ఆ వివరాలను పరిశీలిస్తే... ఎంఎన్సీ కంపెనీలో పని చేస్తున్న ఓ యువతి ఓ వ్యక్తిని ఇష్టపడింది. తొలి చూపులోనే ప్రేమలో పడింది. అయితే అతడు తక్కువ కులం వాడు కావడంతో యువతి తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఆ యువతిని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి కిచ్చి బలవంతంగా వివాహం జరిపించారు.
పెళ్లి చేసుకున్నా కూడా ఆమె మనసు మారలేదు. పెళ్లయి అత్తారింటికి వెళ్లాల్సిన ఆ యువతి తాళి బంధాన్నితెంచుకుని భర్తను వదలి పుట్టింటికి చేరుకుంది. ఈ అవమానాన్ని భరించలేని యువతి తండ్రి ప్రియుడి వద్దకు వెళ్లి తన కూతుర్ని పెళ్లి చేసుకోమని బతిమిలాడాడు. అయితే మరో వ్యక్తితో ఓ రోజంతా ఉన్న ఆమెను పెళ్లి చేసుకోనని ప్రియుడు తెగేసి చెప్పడంతో యువతితో కలిసి కుటుంబమంతా షాక్ అయ్యారు.
మరోవైపు వివాహతంతు పూర్తి కావడంతో పెళ్లి కుమారుడి కుటుంబసభ్యులు కోర్టెక్కారు. దీంతో పరస్పర అంగీకారంతో ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే విడాకుల కేసులు పేరుకుపోతుండటంతో దీనికి కొంత సమయం పట్టే అవకాశముంది. ఓ వైపు పెళ్లి బంధాన్ని తెంచుకుని, మరోవైపు ప్రియుడు కూడా కాదనడంతో ఆమె పరిస్థితి అటూ ఇటూ కాకుండా పోయింది.