Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జడ్జీలపై దూషణల పర్వం : సీపీఎం నేతకు జైలుశిక్ష!

జడ్జీలపై దూషణల పర్వం : సీపీఎం నేతకు జైలుశిక్ష!
, శనివారం, 31 జనవరి 2015 (12:00 IST)
జడ్జీలను దూషించిన కేసులో సీపీఎం నేతకు సుప్రీంకోర్టు నాలుగు నెలల జైలుశిక్ష విధించింది. ఈయన జడ్జీలను ఫూల్స్ అంటూ వ్యాఖ్యానించారు. వీటిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంది. 
 
రోడ్డు ప్రమాదాలను నివారించాలన్న ఉద్దేశంతో జూన్ 23, 2010లో కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ రహదారుల పక్కన బహిరంగ సభలను నిషేధించింది. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తీర్పు చెప్పిన జడ్జీలను ఫూల్, ఇడియట్ అంటూ పరుష పదజాలంతో దూషించారు. 
 
వెంటనే స్పందించిన హైకోర్టు ఆయను కోర్టు ధిక్కారం కింద దోషిగా నిర్ధారించి, ఆరు నెలల జైలుశిక్ష విధించింది. తర్వాత శిక్షను సమర్థించిన సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ విక్రమ్ జిత్ సేన్, జస్టిస్ నాగప్పన్‌ల ద్విసభ్య ధర్మాసనం నాలుగు వారాలకు కుదించింది. తీర్పులపై విమర్శలు చేస్తే ఊరుకోమని, న్యాయాధికారులపై అనాగరిక, పరుష పదజాలంవాడితే సహించేదిలేదని హెచ్చరించింది. 

Share this Story:

Follow Webdunia telugu