Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సదరన్ జోనల్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్‌గా కేసీఆర్ ఎంపిక!

సదరన్ జోనల్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్‌గా కేసీఆర్ ఎంపిక!
, బుధవారం, 23 జులై 2014 (19:52 IST)
సదరన్ జోనల్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపికయ్యారు. దీనికి సంబంధించి కేంద్రం రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు వెలువరించినట్లు తెలుస్తోంది. తద్వారా రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదే తెలంగాణకు అరుదైన గౌరవం దక్కినైట్లెంది. సదరన్ జోనల్ కౌన్సిల్ ఛైర్మన్‌గా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యవహరించనున్నారు. 
 
ఈ కౌన్సిల్‌లో సభ్య రాష్ట్రాలుగా తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి కూడా ఉన్నాయి. గతంలో సదరన్ జోనల్ కౌన్సిల్ వైస్‌ఛైర్మన్‌గా తమిళనాడు సీఎం జయలలిత వ్యవహరించారు.

Share this Story:

Follow Webdunia telugu