Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జమ్మూకాశ్మీర్‌లో అల్లర్లు... ఐదుగురు ఆందోళనకారుల మృతి

జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో తాజాగా అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. వాస్తవానికి ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్‌కౌంటర్ అనంతరం చెలరేగిన అల్లర్లు తగ్గుముఖం పట్టని సంగతి తెల్సిందే.

జమ్మూకాశ్మీర్‌లో అల్లర్లు... ఐదుగురు ఆందోళనకారుల మృతి
, మంగళవారం, 16 ఆగస్టు 2016 (14:14 IST)
జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో తాజాగా అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. వాస్తవానికి ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్‌కౌంటర్ అనంతరం చెలరేగిన అల్లర్లు తగ్గుముఖం పట్టని సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో బుద్‌గావ్ జిల్లాలోని మాగం గ్రామంలో ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య మంగళవారం జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందారు. 
 
సీఆర్‌పీఎఫ్ వాహనంపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మృతిచెందగా, మరో 15 మంది గాయపడ్డారు. కాగా, కాశ్మీర్‌లో తాజా అల్లర్లపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనుండగా, ఇందులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పాల్గొననున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైద్యుడే హంతకుడయ్యాడు.. ఆరుగురి ప్రాణాలు తీసేశాడు.. ఎందుకు?