Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్నాటక ముఖ్యంత్రి సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ కన్నుమూత...

కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ తీవ్ర అనారోగ్యంతో బెల్జియంలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆయన వయసు 39 సంవత్సరాలు. భారత కాలమానం ప్రకారం బెల్జియంలో శనివారం సాయంత్రం 4 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. రాకేష్ విదేశీ పర్యటనల

కర్నాటక ముఖ్యంత్రి సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ కన్నుమూత...
, శనివారం, 30 జులై 2016 (16:51 IST)
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ తీవ్ర అనారోగ్యంతో బెల్జియంలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆయన వయసు 39 సంవత్సరాలు. భారత కాలమానం ప్రకారం బెల్జియంలో శనివారం సాయంత్రం 4 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. రాకేష్ విదేశీ పర్యటనలో ఉండగా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. పాంక్రియాస్ సమస్య కారణంగా మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయినట్లు వైద్యులు నిర్థారించారు. రాకేష్ రాజకీయ నాయకుడి కుటుంబానికి చెందినప్పటికీ సినిమాల్లోనూ నటించాడు. 
 
రాకేష్ బెల్జియం పర్యటనకు వెళ్లి అక్కడే తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరాడు. ఐతే ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో సీఎం సిద్ధరామయ్య వెనువెంటనే కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు తన కుమారుడికి బెల్జియంలో మెరుగైన వైద్యం అందేలా చూడాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆయన విజ్ఞప్తి మేరకు మంచి ఆసుపత్రిలో చేర్పించాలని సుష్మా స్వరాజ్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఐనప్పటికీ అతడు కన్నుమూశాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముజఫర్ నగర్లో బాలికలపై రేప్ కేసులెక్కువ: 146 నుంచి 316కు పెంపు.. ప్రత్యేక కోర్టు ఏర్పాటు!