Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కలాం పార్థివదేహం మధురైకి తరలింపు... వెంట వెంకయ్య, పారికర్

కలాం పార్థివదేహం మధురైకి తరలింపు... వెంట వెంకయ్య, పారికర్
, బుధవారం, 29 జులై 2015 (08:40 IST)
భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం పార్థివదేహాన్ని ఢిల్లీలోని పాలం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో మధురైకి తరలించారు. అక్కడ నుంచి రామేశ్వరానికి తరలిస్తారు. వెంట కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, మనోహర్ పారికర్‌లు ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్నారు.  
 
కలాం పార్థివదేహాన్ని ముందుగా 10 రాజాజీమార్గ్‌లోని కలాం నివాసం నుంచి రక్షణశాఖ అధికారులు పాలం విమానాశ్రయానికి తరలించారు. అక్కడ గౌరవ వందనం చేసిన అనంతరం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక విమానంలో మధురైకి తరలించారు. కేంద్రమంత్రులు వెంక్యనాయుడు, మనోహర్‌ పారికర్‌ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వీరిద్దరూ కలాం పార్థివదేహంతో పాటే తమిళనాడు వెళ్లారు.

Share this Story:

Follow Webdunia telugu