Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కైలాష్ సత్యార్ధి ఇంట్లో చోరీ.. నోబెల్ ప్రైజ్ సేఫ్...

నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు నోబెల్ బహుమతిని చోరీ చేశారు. చోరీకి గురైంది కేవలం నమూనా మాత్రమే. అసలు నోబెల్ బహుమతి రాష్ట్రపతి భవన్‌లో ఉంది. కైలాష్ సత్యార్ధి నివాసంల

కైలాష్ సత్యార్ధి ఇంట్లో చోరీ.. నోబెల్ ప్రైజ్ సేఫ్...
, మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (15:05 IST)
నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు నోబెల్ బహుమతిని చోరీ చేశారు. చోరీకి గురైంది కేవలం నమూనా మాత్రమే. అసలు నోబెల్ బహుమతి రాష్ట్రపతి భవన్‌లో ఉంది. కైలాష్ సత్యార్ధి నివాసంలో ఉండేది అసలైన నోబెల్ బహుమతి అని భావించి దొంగలు ఈ బహుమతిని చోరీ చేసినట్టుగా తెలుస్తోంది. 
 
ప్రస్తుతం కైలాష్ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన పాకిస్థాన్ బాలిక మాలాలా యూసుఫ్ జాయ్‌తో కలిసి నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న విషయం తెల్సిందే. ఈ బహుమతి ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్రపతి భవన్‌లో భద్రంగా ఉంచారు. 
 
ఆ మధ్య లోక్‌సభ ఎంపీ శశి థరూర్ ఇంటినుంచి కూడా దోపిడీ దొంగలు విలువైన విగ్రహాలు, వస్తువులు దోపిడీ చేశారు. ప్రధాని మోదీ బహుకరించిన గాంధీ కళ్ళ ద్దాలుకూడా వీటిలో ఉన్నాయి. కైలాష్ సత్యార్తి ఇంట్లో జరిగిన చోరీపై దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాల్లో అభివృద్ధి నిల్.. అవాస్తవాలను నమ్మొద్దు: నారా లోకేష్