Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కలాం ఫోటోకు దండ.. కలాం మరణవార్తతో షాక్.. ఆమెకు నోట మాట రాలేదు..

కలాం ఫోటోకు దండ.. కలాం మరణవార్తతో షాక్.. ఆమెకు నోట మాట రాలేదు..
, మంగళవారం, 28 జులై 2015 (18:01 IST)
హజారీబాగ్ స్కూలులో ఈ నెల 22న జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫోటోకు దండవేసి, నివాళి అర్పించిన జార్ఖండ్ మహిళా మంత్రి నీరా యాదవ్ కలాం మరణ వార్త విని ఒక్కసారిగా షాక్ తిన్నారు. బతికుండగానే కలాం ఫోటోకు దండవేసి.. నివాళి అర్పించి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కున్న నీరా యాదవ్.. కలాం తుదిశ్వాస విడిచారనే వార్తతో షాక్ అయ్యారు. 
 
ఇంకా కలాం మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కలాం లేరన్న వార్తను నమ్మలేక పోతున్నానని చెప్పారు. నీరా యాదవ్ చర్యతోనో, విధి వైపరీత్యమో ఏమో కాని, వారం తిరక్కుండానే కలాం తుదిశ్వాస వదలడంతో ఆమెకు నోట మాట రాలేదు. తనకు కలాంపై అమితమైన గౌరవం ఉందని, తన చిత్తశుద్ధిని శంకించరాదని ఆమె వేడుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu