Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంజాన్ మాసమంతా.. మసీదులకు ఉచిత బియ్యం: జయమ్మ ప్రకటన

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (15:07 IST)
ఎన్నికల సందర్భంగా ప్రజలపై వరాల వర్షం కురిపించిన తమిళనాడు సీఎం జయలలిత.. తాజాగా వచ్చేవారం నుంచి ప్రారంభం కానున్న రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింకు మరో వరాన్ని ప్రసాదించారు. తమిళనాడులో గుర్తింపు పొందిన 3 వేలకు పైగా మసీదులకు రంజాన్ మాసాంతం ఉచితంగా బియ్యం అందిస్తామని.. ఇందుకోసం 4,600 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సిద్ధం చేసినట్లు జయమ్మ ప్రకటించారు. 
 
ఆయా మసీదులకు నెల మొత్తం బియ్యాన్ని అందించాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా.. పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయాలని జయమ్మ పోలీసు శాఖకు ఆదేశాలు జారీచేశారు. కాగా, 2001లో ఏఐఏడీఎంకే ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తరువాత మసీదులకు ఉచిత బియ్యం పథకం ప్రారంభమైంది. అప్పుడు అటకెక్కిన ఈ స్కీమ్‌ను పునరుద్ధరించడంపై ముస్లిం వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments