Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమ్మ కన్నుమూత రూమర్స్: అపోలో వద్ద ఉద్రిక్తత... రాళ్లు, చెప్పులతో కార్యకర్తల దాడి..

తమిళనాడు సీఎం జయలలిత కన్నుమూశారని తమిళ మీడియాలో ఒక్కసారిగా వార్తలు రావడంపై ఆమె అభిమానులు ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో అమ్మ ఫ్యాన్స్ అపోలో ఆస్పత్రిపై దాడి చేశారు. అమ్మ ఆరోగ్యంపై క్లారిటీ ఇవ్వడంలో అపోలో విఫల

అమ్మ కన్నుమూత రూమర్స్: అపోలో వద్ద ఉద్రిక్తత... రాళ్లు, చెప్పులతో కార్యకర్తల దాడి..
, సోమవారం, 5 డిశెంబరు 2016 (18:29 IST)
తమిళనాడు సీఎం జయలలిత కన్నుమూశారని తమిళ మీడియాలో ఒక్కసారిగా వార్తలు రావడంపై ఆమె అభిమానులు ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో అమ్మ ఫ్యాన్స్ అపోలో ఆస్పత్రిపై దాడి చేశారు. అమ్మ ఆరోగ్యంపై క్లారిటీ ఇవ్వడంలో అపోలో విఫలమైందని, బులిటెన్లు విడుదల చేస్తూ.. గందరగోళ పరిస్థితిని నెలకొల్పిందని.. అమ్మ చికిత్సకు స్పందిస్తున్నారని చెప్తున్న అపోలో ఆమె ఫోటోలను రిలీజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులతో వాగ్వాదం పెట్టుకున్న అమ్మ అభిమానులు, కార్యకర్తలు బారికేడ్లను తొలగించి ఆసుపత్రిలోకి వెళ్లేందుకు విఫలయత్నం చేశారు. ఆసుపత్రిలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో కుర్చీలు విసిరేశారు.
 
దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న పోలీసులు వారిని చెదరగొట్టి వెంటనే పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. అమ్మకు ఏమవుతుందేననే ఆందోళనతో ఆమె అభిమానులు పెద్ద ఎత్తున అపోలో వద్దుకు చేరుకుంటున్నారు. దీంతో వారందరినీ అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారుతోంది. అపోలో ఆస్పత్రి దగ్గర గందరగోళం నెలకొంది. రాళ్లు, చెప్పులతో ఆస్పత్రిపై కార్యకర్తలు దాడి చేశారు. ఆస్పత్రిలోకి దూసుకెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. మీడియా ప్రతినిధులపై కూడా దాడికి యత్నించారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమ్మ ఆరోగ్యంపై అపోలో రోజుకో ప్రకటన.. ప్రకటనలు.. బులిటెన్లు వద్దు.. ఫోటోలు విడుదల చేయండి..