Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏయ్.. ఫోటోలు తీయడం ఆపు.. కాంతి కళ్ళలో పడుతుంది... ఫోటోగ్రాఫర్లపై జయా బచ్చన్ ఫైర్

మీడియా ఫోటోగ్రాఫర్లపై బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి, ఎంపీ జయాబచ్చన్ మండిపడ్డారు. ఏయ్... ఫోటోలు తీయడం ఆపు.. కాంతి కళ్ళలో పడుతుంది. అది నాకు నచ్చదు అంటూ కళ్ళెర్రజేశారు.

ఏయ్.. ఫోటోలు తీయడం ఆపు.. కాంతి కళ్ళలో పడుతుంది... ఫోటోగ్రాఫర్లపై జయా బచ్చన్ ఫైర్
, గురువారం, 18 ఆగస్టు 2016 (16:51 IST)
మీడియా ఫోటోగ్రాఫర్లపై బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సతీమణి, ఎంపీ జయాబచ్చన్ మండిపడ్డారు. ఏయ్... ఫోటోలు తీయడం ఆపు.. కాంతి కళ్ళలో పడుతుంది. అది నాకు నచ్చదు అంటూ కళ్ళెర్రజేశారు. ముంబైలోని ఓ కాలేజీలో జరుగుతున్న కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. 
 
ఫోటోలు తీయడం ఆపాలంటూ నానా హంగామా చేశారు. ఫోటోలు తీయడం తనకు నచ్చదని... కాంతి కళ్లలో పడటం తనకు ఇబ్బందిగా ఉందని ఆమె చెప్పారు. అంతేకాదు, భారతీయులుగా కనీస గౌరవం మీకు లేదా? కెమెరా గానీ, మొబైల్ కానీ ఉంటే ఎక్కడైనా, ఏ సమయంలోనైనా సదరు వ్యక్తి అనుమతి లేకుండా ఫోటోలు తీస్తారా? అంటూ ప్రశ్నించారు. 
 
ఆమె విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలో ఫోటోలు తీస్తుండగా ఆమె మైక్‌ను కింద పడేశారు. ఫోటోలు తీయడం అయిపోయిన తర్వాత మాట్లాడతానంటూ అసహనానికి లోనయ్యారు. ప్రెస్‌కు, మీడియాకు తాను వ్యతిరేకం కాదని అయితే ఎక్కడ కనిపించినా ఫోటోలు తీసి ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. అంతేకాదండోయ్.. విద్యార్థులపై కూడా ఆమె నిప్పులు చెరిగారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్వాతిని నేను హత్య చేయలేదు: నోరు విప్పిన రామ్ కుమార్.. ఇంతకీ ఎవరు చంపారు?