Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజస్థాన్‌లో అత్యాచారం చేస్తూ ఇంటిని దోచుకున్నారు!

రాజస్థాన్‌లో అత్యాచారం చేస్తూ ఇంటిని దోచుకున్నారు!
, ఆదివారం, 21 సెప్టెంబరు 2014 (13:05 IST)
దేశంలో మహిళలపై చిత్ర విచిత్రంగా అత్యాచారాలు, నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. ఇంటిని దోచుకునేందుకు వచ్చిన దోపిడీ దొంగలు.. ఆ ఇంటిలోని ఓ మహిళపై మార్చిమార్చి అత్యాచారం చేస్తూ ఇంటిని లూటీ చేశారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ కేసు వివరాలను తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లోని విలాసవంతమైన వైశాలి నగర్ ప్రాంతంలో వంటగది కిటికీ గ్రిల్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు అక్కడున్న పెద్దమనిషిని తాడుతో కట్టేశారు. పిల్లలను కత్తితో బెదిరించి గదిలో బంధించారు. తర్వాత ఆ పెద్దమనిషి కుమారుడి కత్తితో 9 సార్లు వీపు, పొట్ట భాగాల్లో పొడిచారు. దీంతో అతను స్పృహ తప్పిపోయాడు. 
 
ఆ తర్వాత అతడి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడుతూ దోపిడీకి తెగబడ్డారు. 10 వేల రూపాయల నగదు, 150 గ్రాముల బంగారం దోచుకున్న దొంగలు, అల్మారాలను చిందరవందర చేసి వెళ్లిపోయారు. అనంతరం బాధితుడ్ని ఆసుపత్రిలో చేర్పించగా, అతడికి రెండు శస్త్రచికిత్సలు జరిగాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu