టెక్కీ స్వాతిది పరువు హత్య... మతం మార్చుకుని ప్రేమించడం వల్లే : తిరుమావళవన్
చెన్నై టెక్కీ స్వాతిది ప్రేమ హత్య కాదనీ పరువు హత్య అని డీపీఐ ప్రధాన కార్యదర్శి, దళిత నేత, మాజీ మంత్రి తిరుమావళవన్ ఆరోపించారు. అందువల్ల ఈ హత్యపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
చెన్నై టెక్కీ స్వాతిది ప్రేమ హత్య కాదనీ పరువు హత్య అని డీపీఐ ప్రధాన కార్యదర్శి, దళిత నేత, మాజీ మంత్రి తిరుమావళవన్ ఆరోపించారు. అందువల్ల ఈ హత్యపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ చెన్నై, నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో జరిగిన స్వాతి హత్యకు కారణం ఏకపక్ష ప్రేమ కాదని, మతం మార్చుకొని ప్రేమించడం వల్లే ఈ దారుణం జరిగిందన్నారు. ఈ మధ్యకాలంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పరువు హత్యలు సీరియల్లా జరుగుతున్నాయన్నారు.
ఈ కోవలోనే స్వాతి హత్య కూడా జరిగింది. దీనికి ఏకపక్ష ప్రేమ కారణం కాదన్నారు. మతం మార్చుకొని ప్రేమించడం వల్లే ఆమె హత్యకు గురైందన్నారు. ఈ విషయం ఈ కేసులో ప్రధాన నిందితుడైన రామ్కుమార్ ఫేస్బుక్లో స్వాతిని ఏకపక్షంగా ప్రేమించినట్టు ఎక్కడా కూడా సందేశాలు లేవని ఆయన గుర్తు చేశారు. అందువల్ల స్వాతి స్నేహితుడిగా భావిస్తున్న ముస్లి యువకుడు బిలాల్ మాలిక్ వద్ద కూడా లోతుగా విచారణ జరపాలని కోరారు.