Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టెక్కీ స్వాతిది పరువు హత్య... మతం మార్చుకుని ప్రేమించడం వల్లే : తిరుమావళవన్

చెన్నై టెక్కీ స్వాతిది ప్రేమ హత్య కాదనీ పరువు హత్య అని డీపీఐ ప్రధాన కార్యదర్శి, దళిత నేత, మాజీ మంత్రి తిరుమావళవన్ ఆరోపించారు. అందువల్ల ఈ హత్యపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

టెక్కీ స్వాతిది పరువు హత్య... మతం మార్చుకుని ప్రేమించడం వల్లే : తిరుమావళవన్
, మంగళవారం, 19 జులై 2016 (08:47 IST)
చెన్నై టెక్కీ స్వాతిది ప్రేమ హత్య కాదనీ పరువు హత్య అని డీపీఐ ప్రధాన కార్యదర్శి, దళిత నేత, మాజీ మంత్రి తిరుమావళవన్ ఆరోపించారు. అందువల్ల ఈ హత్యపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ చెన్నై, నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో జరిగిన స్వాతి హత్యకు కారణం ఏకపక్ష ప్రేమ కాదని, మతం మార్చుకొని ప్రేమించడం వల్లే ఈ దారుణం జరిగిందన్నారు. ఈ మధ్యకాలంలో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పరువు హత్యలు సీరియల్లా జరుగుతున్నాయన్నారు. 
 
ఈ కోవలోనే స్వాతి హత్య కూడా జరిగింది. దీనికి ఏకపక్ష ప్రేమ కారణం కాదన్నారు. మతం మార్చుకొని ప్రేమించడం వల్లే ఆమె హత్యకు గురైందన్నారు. ఈ విషయం ఈ కేసులో ప్రధాన నిందితుడైన రామ్‌కుమార్‌ ఫేస్‌బుక్‌లో స్వాతిని ఏకపక్షంగా ప్రేమించినట్టు ఎక్కడా కూడా సందేశాలు లేవని ఆయన గుర్తు చేశారు. అందువల్ల స్వాతి స్నేహితుడిగా భావిస్తున్న ముస్లి యువకుడు బిలాల్‌ మాలిక్‌ వద్ద కూడా లోతుగా విచారణ జరపాలని కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేస్‌బుక్ యూజర్లకు శుభవార్త... ఇష్టమైన ఆఫ్‌లైన్ వీడియోలు సేవ్ చేసుకోవచ్చు!