Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాక్‌ను పొగిడితే చెప్పుతో కొట్టి తరమాలి... సాధ్వి వివాదాస్పద వ్యాఖ్య..!

పాక్‌ను పొగిడితే చెప్పుతో కొట్టి తరమాలి... సాధ్వి వివాదాస్పద వ్యాఖ్య..!
, గురువారం, 5 మార్చి 2015 (10:03 IST)
భారతదేశంలో ఉంటూ పాకిస్థాన్‌ను పొగిడేవాళ్లను చెప్పుతో కొట్టి తరమాలని వీహెచ్‌పీ నేత సాధ్వి బాలికా సరస్వతీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళూరులో జరిగిన హిందూ సమాజోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ప్రసంగిస్తూ పాక్‌ను పొగిడేవారిని ఆ దేశానికే తరిమి తరిమి కొట్టాలన్నారు. 
 
భారత్‌లో ఉంటూ, ఇక్కడ పండుతున్న తిండి తింటూ పరాయి దేశాన్ని పొగిడేవాళ్లను కొట్టి తరమాలని ఉద్బోధించారు. ఇటువంటి వ్యాఖ్యలను ఎంతమాత్రం సహించరాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో శ్రీరాముడికి గుడి కట్టాలని, ఇస్లామాబాదులో కూడా రామమందిరం నిర్మించి అక్కడకు వెళ్లి పూజలు నిర్వహించాలంటూ పిలుపునిచ్చారు.

మనమంతా ఆయుధాలు పట్టుకోవాల్సిన సమయం వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. కాగా ఈ విషయం గురించి పోలీసుల వద్ద ప్రస్తావించగా, వారు తమకు ఇంత వరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu