భారత్లో పోర్నోగ్రఫీకి పురుషుల నుంచి భలే డిమాండ్ ఉందని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. అందువల్ల దేశంలో పోర్నోగ్రఫీని అదుపు చేయడం అసాధ్యమని తేల్చి చెప్పింది. ముఖ్యంగా దేశంలోని లైంగిక అసంతుష్ట పురుషుల నుంచి దీనికి భారీ డిమాండ్ ఉందని పేర్కొంది.
సైబర్ లైంగిక నేరాలు, నేరగాళ్లపై దర్యాప్తు జరిపేవిధంగా సీబీఐను దేశవ్యాప్తంగా ఏకైక విచారణ సంస్థగా ఏర్పాటుచేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలైంది. దీనిపై సీబీఐ తన స్పందన తెలియజేసింది.
కామోద్రేక పూరితమైన, మహిళలపై హింసాపూరితమైన కంటెంట్ను వారు వీక్షిస్తున్నారని తెలిపింది. భారత్ సైబర్ మార్కెట్ గణనీయమైన శక్తిగా ఉండటంతో దీనిపై సీమాంతర విద్రోహుల నుంచి తరచూ సైబర్ దాడులు జరుగుతున్నాయని పేర్కొంది.
ఒకవేళ పోర్నోగ్రఫీకి భారీ డిమాండ్ ఉండటంతో ఒక వెబ్సైట్ను బ్లాక్ చేసినా ఇంటర్నెట్ కంటెంట్ ప్రోవైడర్స్ వెంటనే వేరే వెబ్సైట్ను ముందుకుతెస్తున్నారని, అందువల్ల దీనిని నిరోధించడం కష్టంగా మారిందని కోర్టుకు సీబీఐ వివరించింది.