Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కూతురు కోసం పక్కింటి అబ్బాయికి 'ప్లగ్' పెట్టిన ఆంటీ... ఏం చేసింది?

నేనేమైనా ఫర్లేదు పక్కింటివాడు మాత్రం బాగుపడకూడదనే మనస్తత్వం కొందరిలో ఉంటుంది. అలాంటి పనే జైపూర్‌లో ఆంటీ చేసింది. ఆమె తన కుమార్తెను ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్నత చదువులు చదివించాలనుకుంది. అలాగే పక్కింట్లో నివాసం ఉండే మరో యువకుడు కూడా సిడ్నీలో చదివేంద

కూతురు కోసం పక్కింటి అబ్బాయికి 'ప్లగ్' పెట్టిన ఆంటీ... ఏం చేసింది?
, బుధవారం, 27 జులై 2016 (16:24 IST)
నేనేమైనా ఫర్లేదు పక్కింటివాడు మాత్రం బాగుపడకూడదనే మనస్తత్వం కొందరిలో ఉంటుంది. అలాంటి పనే జైపూర్‌లో ఆంటీ చేసింది. ఆమె తన కుమార్తెను ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్నత చదువులు చదివించాలనుకుంది. అలాగే పక్కింట్లో నివాసం ఉండే మరో యువకుడు కూడా సిడ్నీలో చదివేందుకు నిర్ణయించుకున్నాడు. ఇరుగుపొరుగు కావడంతో ఇద్దరూ కలిసి వీసాకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడే ఓ చిక్కు వచ్చి పడింది. ఆంటీ కుమార్తెకు అధికారులు వీసాను నిరాకరించారు. కానీ పొరుగింటి అబ్బాయి రాజ్ సింగుకు మాత్రం వీసా వచ్చింది. దీనితో అతడు ఆస్ట్రేలియాకు ప్రయాణమయ్యాడు. 
 
లగేజీలంతా తీసుకుని విమానాశ్రయానికి వెళ్లాడు. మరికొద్ది నిమిషాల్లో విమానం ఎక్కబోతున్నాడనగా ఎయిర్ పోర్ట్ అధికారులకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. రాజ్ సింగ్ బ్యాగుల్లో బాంబులు ఉన్నాయంటూ ఆ ఫోన్ కాల్ సారాంశం. దానితో అధికారులు వెనువెంటనే అతడిని ఆపేసి అతడి బ్యాగులన్నీ చెక్ చేశారు. వారికి ఎలాంటి అనుమానం కలుగలేదు. దీనితో ఆ ఫోన్ నెంబరు ఎవరిదని దర్యాప్తు చేయగా తమ పొరుగుంటి ఆంటీదని తేల్చాడా యువకుడు. దీంతో ఆమె వద్ద విచారణ జరుపగా, తన కుమార్తెకు వీసా రాకపోగా పక్కింటి అబ్బాయికి వీసా రావడం, అతడు ఉన్నత చదువులకు వెళ్తుండటాన్ని జీర్ణించుకోలేక అలాంటి పనికి పూనుకున్నట్లు చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంసెట్-2 లీక్ వాస్తవమే... 30 మంది విద్యార్థులు లబ్ధి: టీఎస్ సీఐడీ