Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్ ఓ హిందూదేశం ... నేను క్రిస్టియన్ హిందువుని : డి సౌజా

భారత్ ఓ హిందూదేశం ... నేను క్రిస్టియన్ హిందువుని : డి సౌజా
, శుక్రవారం, 25 జులై 2014 (19:13 IST)
భారత్ ఓ హిందుదేశమని, తాను క్రిస్టియన్ హిందువుగా ఇక్కడ నివశిస్తున్నట్టు గోవా ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డి సౌజా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి సంపూర్ణ మద్దతిస్తే భారత్‌ను ఓ హిందూదేశంగా మారుస్తారంటూ గోవా సహకారమంత్రి దీపక్ ధవలికర్ చేసిన వ్యాఖ్యలపై డి సౌజా శుక్రవారం స్పందించారు. 
 
భారత దేశం ఇదివరకు హిందూ దేశమని, ఇకముందు కూడా హిందూదేశంగానే ఉంటుందన్నారు. భారత్ ఎప్పుడు హిందూ దేశమే అన్నారు. ఎవరు కూడా హిందూ దేశాన్ని సృష్టించలేరన్నారు. ఇది హిందుస్తాన్... హిందుస్తాన్‌లోని అందరు కూడా హిందువులే అన్నారు. తనతో సహా అందరు హిందువులే అన్నారు. అయితే, తనలాంటి వారు క్రిస్టియన్ హిందువులు అని చెప్పారు. ధవలికర్ తాను ఏం చెప్పాడో ఆయనకు స్పష్టత ఉందని డి సౌజా అభిప్రాయపడ్డారు. 

Share this Story:

Follow Webdunia telugu