Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైలుకు అడ్డంగా దిగాలనీ సెల్ఫీకి ప్రయత్నించి జైలుపాలైన కుర్రోళ్లు

రైలుకు అడ్డంగా దిగాలనీ సెల్ఫీకి ప్రయత్నించి జైలుపాలైన కుర్రోళ్లు
, శనివారం, 28 మే 2016 (12:10 IST)
రోజురోజుకి సెల్ఫీ పిచ్చోళ్ల చేష్టలు మితిమీరుతున్నాయి. చిన్నపెద్ద లేకుండా ప్రతియొక్కరి చేతుల్లోను స్మార్ట్ ఫోన్‌లు ఉండటం, అలా ఫోటో దిగి ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేయడమే పనిగా పెట్టుకున్నారు. కానీ సెల్ఫీలు సరదాకి తీసుకుంటే ఫర్వాలేదుగానీ కొంతమంది ప్రాణం మీదికి తెచ్చుకుంటున్నారు. డ్రైవింగ్‌లో, రోడ్లల్లో ఇలా రకరకాల చోట్ల సాహసాలు చేస్తున్నారు. కానీ కొందరు ఆకతాయిలు రైలు దగ్గర సెల్ఫీలు దిగుతున్నారు. దీనిలో కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కాగా ఇలాంటి సెల్ఫీలకు పాల్పడ్డ వారిని పోలీసులు అరెస్టు చేశారు. 
 
పూర్తి వివరాలను పరిశీలిస్తే... యూపీలోని ఫిరోజాబాద్ జిల్లాలో కొంతమంది యువకులు పాట్నా - న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రె‌స్ ఎదుట సెల్ఫీ దిగాలనే పిచ్చి కోరికతో తుండ్లా - ఎట్మద్పూర్ వద్ద పెద్దపెద్ద రాళ్లు, చెట్టుకొమ్మలు వేసి ట్రాక్ని బ్లాక్ చేశారు. అదృష్టవశాత్తు డ్రైవర్ ఈ విషయాన్ని గమనించి ఎమెర్జెన్సీ బ్రేక్ వేయడంతో తృటిలో ప్రమాదం తప్పింది. 
 
ఈ ఘటనకు పాల్పడినవారు 13-16 ఏళ్ల లోపు పిల్లలే. స్పీడుగా వస్తున్న రైలులో ఎన్నోసార్లు సెల్ఫీలు దిగారు కూడా. ఆర్పీఎఫ్ సిబ్బంది ఈ టీనేజర్లను అరెస్టు చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సెల్ఫీ పిచ్చి ఆ టీనేజర్లను ఊసలు లెక్కపెట్టించింది. బహుశా ఈ విషయం తెలుసుకున్న ఎవరూ ఇకమీదట సెల్ఫీల జోలికి వెళ్లరేమో.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెరపైకి ఫెడరల్ ఫ్రంట్.. ప్రాంతీయ శక్తుల ఏకీకరణకు లాలూ పిలుపు