Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్యపై అనుమానం: గ్రైండర్ రాయితో మోది హత్య చేసిన భర్త!

భార్యపై అనుమానం: గ్రైండర్ రాయితో మోది హత్య చేసిన భర్త!
, శుక్రవారం, 30 మే 2014 (16:33 IST)
భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి క్షణికావేశంతో భార్యను అతిదారుణంగా హత్యచేశాడు. అంతేకాకుండా మూడు సంవత్సరాల కుమార్తెను కూడా పొట్టనపెట్టుకున్నాడు. ఈ దారుణ సంఘటన గురువారం తమిళనాడులోని ఈరోడ్ జిల్లా తూత్తుకుడిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలిలావున్నాయి....

తమిళనాడులోని ఈరోడ్‌కు చెందిన శంకర్, కోకిల భార్యాభర్తలు. వీరు స్థానికంగా కిరాణా దుకాణం నడుపుతున్నారు. భార్యప్రవర్తనపై అనుమానంతో తరచూ శంకర్ ఆమెతో గొడవపడేవాడు. ఈ క్రమంలో గురువారం కోకిల సెల్‌ఫోన్‌లో మాట్లాడటం చూసిన శంకర్ ఎవరితో మాట్లాడుతున్నావని నిలదీశాడు. దీంతో వారిద్దరిమధ్య వాగ్వివాదం ఏర్పడింది. ఆగ్రహానికి గురైన శంకర్ గ్రైండర్ రాయితో మోది భార్యను దారుణంగా హత్య చేశాడు. ఆపై క్షణికావేశంతో మూడుసంవత్సరాల కుమార్తెను గొడకు మోదాడు. చిన్నారి తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు శంకర్‌ను అరెస్టు చేసి కేసు నమోదుచేశారు.

Share this Story:

Follow Webdunia telugu